- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పనికని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. మార్గమధ్యలోనే..
దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం యాక్తపూర్ స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఏఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్య(51), కొండ పేట గ్రామానికి చెందిన బీచుపల్లి (42) ఇద్దరు ద్విచక్రవాహనంపై పని నిమిత్తం వనపర్తికి వెళ్తున్నారు.
మార్గమధ్యలో యాక్తపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఓ కారు వేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టింది. దీంతో పెద్ద మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపై పరిస్థితి విషమంగా ఉన్న బీచుపల్లిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ బీచుపల్లి మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.