- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టిప్పర్ కిందకు దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి

దిశ, కామారెడ్డి రూరల్: నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ వాహనదారుడు ఎదురుగా వస్తున్న టిప్పర్ కిందకు దూసుకెళ్లి మృతి చెందిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామానికి చెందిన సిద్ధిరాములు అనే వ్యక్తి పనుల నిమిత్తం బైక్ పై నిజామాబాద్ వెళ్లాడు. నిజామాబాద్ లో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా సరిగ్గా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న టిప్పర్ కిందికి దూసుకెళ్లాడు. దీంతో సిద్ధిరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న దేవునిపల్లి ఎస్ఐ ప్రసాద్ పరిస్థితిని సమీక్షించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.