మైసూర్ హోటల్ గదిలో పవిత్ర, నరేష్.. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన మూడో భార్య

by Disha Web Desk 12 |
మైసూర్ హోటల్ గదిలో పవిత్ర, నరేష్.. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన మూడో భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు నరేష్ పెళ్లిగోల మరో కీలక మలుపు తీసుకుంది. నరేష్, నటి పవిత్ర పెళ్లి చేసుకున్నారంటూ నరేష్ మూడో భార్య రమ్య ఆరోపిస్తూ.. మైసూర్ హోటల్ గదిలో ఉన్న నరేష్, పవిత్రను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులతో వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేసింది. హోటల్ గదిలో ఉన్న ఇద్దరిపై చెప్పుతో కొట్టేందుకు నరేష్ మూడో భార్య రమ్య ప్రయత్నించింది. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు నరేష్ విజిల్ కొట్టుకుంటూ.. కేరింతలు కొడుతూ రమ్యను హేళన చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కానీ రమ్య మాత్రం తనకు న్యాయం జరగాలి అని తనకు విడాకులు ఇవ్వకుండా వారు పెళ్లి చేసుకున్నారని నరేష్ మూడో భార్య రమ్య ఆరోపిస్తుంది. అలాగే నరేష్ మాత్రం రమ్యా ఓ బ్లాక్‌మేయర్ అని.. తమని డబ్బు కోసమే ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే రమ్య మాత్రం తనకు న్యాయం చేయాలని లేదంటే నేను కేసు పెడతానని అంటుంది.



Next Story

Most Viewed