- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
2022 వరల్డ్ కప్లో అత్యంత విలువైన ఉమెన్స్ టీం.. క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది-2022కు సంబంధించి 11 మంది ప్లేయర్లతో అత్యంత విలువైన మహిళా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియాకు చెందిన ఏ ఒక్క క్రీడాకారిణి లేకపోవడం గమనార్హం.ఈ జట్టు ప్రకటనతో ఐసీసీ పై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రకటించిన విలువైన ఆటగాళ్ల జాబితాలోని పదకొండు మంది ఆటగాళ్లకు ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ మరోసారి సారధిగా ఎంపికైంది. ఇక ఆసిస్ నుంచి మరో ఇద్దరు టాప్ స్కోరర్లు అలిస్సా హిలీ, రాచెల్ హెనీస్తో పాటు మెత్ మూనీను సైతం ఐసీసీ ఎంపిక చేసింది. ఇక ఆసియా నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ సల్మాఖాటూన్ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ టీం తరఫున ఇద్దరు ప్లేయర్లు నట్ స్కివర్, సోఫీ ఎకెల్ స్టోన్.. వెస్టిండీస్ నుంచి హేలీ మాథ్యూస్, సౌతాఫ్రికా జట్టు నుంచి లారా వొల్వార్డ్, మరిజెన్నె కాప్ను అత్యంత విలువైన టీముగా ఐసీసీ ఎంపిక చేసింది.