రిపోర్టర్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు..

by Disha Web Desk 13 |
రిపోర్టర్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు..
X

దిశ, హుజూర్‌నగర్ : పత్రికా సమావేశంలో రిపోర్టర్ పై దాడికి పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగింది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం పట్టణానికి చెందిన సింగ మోహన్ రావు పత్రికా సమావేశాన్ని స్థానిక టౌన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే సమయానికి అక్కడకు వచ్చి‌న ములకలపల్లి రాంబాబు, సోమగాని ప్రదీప్, దగడ గోపి అనే ముగ్గురు వ్యక్తులు.. ఎవరు రా.. ప్రెస్ మీట్ పెట్టేది, పర్మిషన్ తీసుకున్నారా..? ఎవరు ఇచ్చార్రా పర్మిషన్ అంటూ.. అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ యలక సైదులు గౌడ్ పై పిడి గుద్దులు గుద్ది దాడి చేశారు. దీంతో బాధితుడు యలక సైదులు గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు‌ ఎస్ఐ తెలిపారు.


Next Story

Most Viewed