బిడ్డ తన పోలికతో పుట్టలేదని భర్త టార్చర్.. భార్య చేసిన పనికి అంతా షాక్?

by Disha Web |
బిడ్డ తన పోలికతో పుట్టలేదని భర్త టార్చర్.. భార్య చేసిన పనికి అంతా షాక్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలా మంది దంపతులకు అర్ధం చేసుకునే మనస్తత్వాలు లేకుండా పోయాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ కాపురాలను కూల్చుకుంటున్నారు. చిన్న విషయాలకు మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. భర్త అనుమానంతో పెట్టే టార్చర్ భరించలేని భార్య అనాలోచిత నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని జలవహళ్లి గ్రామంలో మంజునాథ్ నాయక్, వనితా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరికి ఓ కూతురు పుట్టింది. దాంతో మంజునాథ్ తన కుమార్తెకు తన పోలికలు లేవని, తనకు పుట్టలేదని అనుమానంతో గొడవలు పడేవాడు. వనితకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అతనికే ఆ పాప పుట్టిందని నిత్యం ఆమెను వేధించేవాడు. ఆ టార్చర్‌ను భరించలేని వనిత తన రెండేళ్ల బిడ్డను బావిలోతోసి అనంతరం ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది.


Next Story

Most Viewed