చెట్టును ఢీకొన్న బస్సు..13 మందికి తీవ్ర గాయాలు

by Mahesh |
చెట్టును ఢీకొన్న బస్సు..13 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మండల పరిధిలోని అడవిలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక గేదె అడ్డు రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులకు వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు గేదెను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే గేదె మృతి చెందింది.



Next Story

Most Viewed