బ్రేకింగ్ న్యూస్... వైరాలో ఉద్రిక్తత

by S Gopi |
బ్రేకింగ్ న్యూస్... వైరాలో ఉద్రిక్తత
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామానికి చెందిన రైతులు అధికారులను తమ సాగు భూములను ల్యాండ్ పూలింగ్ కు అప్పగించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల సాగు భూములను స్వాధీనం చేసుకొవడం దుర్మార్గం చర్య అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు భూములను ల్యాండ్ పూలింగ్ చేయవద్దు అని దళితులకి అన్యాయం చేయడంపై ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భూములు ఇస్తామని, ఉన్న భూములను బలవంతంగా సేకరణ చేయడం రాష్ట్ర ప్రభుత్వ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అన్నారు. వేలాది ఎకరాల భూములు కలిగిఉన్న వారి నుంచి ల్యాండ్ పూలింగ్ చేయాలి.. అలాకాకుండా ఎకరం, అర ఎకరం భూమి ఉన్న నిరుపేద, దళిత రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకొవడం దుర్మార్గం చర్య అని అన్నారు. వందలాది మంది రైతులు సర్వే వద్దు అని డిమాండ్ చేయడంతో వైరా తహశీల్దార్, ఇతర అధికారులు సర్వే చేయకుండా వెళ్లారు. అడ్డుకున్నవారిలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, కాంగ్రెస్ మండల కన్వీనర్ శీలం వెంకటనర్సిరెడ్డి, హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, గొల్లపూడి ప్రకాశరావు, గొల్లపూడి హరినాథ్ బాబు, బెజవాడ వీరభద్రం, వందలాది మంది రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed