గుడివాడ మినీ మహానాడు షెడ్యూల్ ఇదే

by Disha Web Desk |
గుడివాడ మినీ మహానాడు షెడ్యూల్ ఇదే
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న గుడివాడలో నిర్వహించే మినీ మహానాడు షెడ్యూల్‌ను వివరించారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు రోడ్ షోగా బయలుదేరుతారని, సాయంత్రం 5గంటలకు అంగలూరులోని సభా వేదికకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రి 10 గంటలకు నిమ్మకూరులో బస చేసి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జులతో సమీక్షిస్తారని చెప్పారు. అంగలూరు సభలో లక్షలాది మంది పాల్గొంటున్నారని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.



Next Story

Most Viewed