దేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా సూర్యక్షేత్రం

by Mahesh |
దేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా సూర్యక్షేత్రం
X

దిశ, అర్వపల్లి: దేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా తిమ్మాపురం సూర్య క్షేత్రం అభివృద్ధి చెందుతుందని శ్రీ సత్య సాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు భిక్షమయ్య గురూజీ అన్నారు. గురువారం రాష్ట్రంలోని తొలి సూర్య క్షేత్రమైన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూపా శ్రీ సూర్యనారాయణ స్వామి మహా క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సూర్య క్షేత్రం రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తుందని, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో సూర్యదేవాలయం ఒకటిగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకుడు కాకులారపు జనార్దన్ రెడ్డి శాలువాలు, స్వామివారి చిత్రపటం తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఘణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్ రావు, గుడిపెల్లి జైపాల్ రెడ్డి, మారం కోటిరెడ్డి, ఉప్పల రాజేష్, సత్యసాయి భజన మండలి ప్రతినిధులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed