టీమిండియా మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం..!

by Disha Web Desk 13 |
టీమిండియా మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం..!
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సురేశ్ రైనా ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు. చెన్నై నాకు సొం‍త ఇల్లు వంటింది అని.. ఈ గౌరవం నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు. సురేశ్ రైనా భారత్ తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడాడు.



Next Story

Most Viewed