గోడిసిరాల్ విద్యార్థికి ఆలిండియా 14 ర్యాంక్

by Dishanational1 |
గోడిసిరాల్ విద్యార్థికి ఆలిండియా 14 ర్యాంక్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: దస్తురాబాద్ మండలం గోడిసిరాల్ కు చెందిన పొద్దుటూరి స్నేహిత్ రెడ్డికి జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా 14 ర్యాంక్ వచ్చింది. హైదరాబాదులోని నారాయణ కాలేజీలో చదివే స్నేహిత్ రెడ్డి నిర్మల్ జిల్లా వాసి. ఆయన తల్లిదండ్రులు పొద్దుటూరి మైపాల్ రెడ్డి సౌజన్యలు వ్యాపారం రీత్యా నిర్మల్లో నివాసం ఉంటున్నారు. స్నేహిత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం నిర్మల్ లోని సెయింట్ థామస్ స్కూల్లో సాగింది. ఆరవ తరగతి వరకు నిర్మల్ లో చదువుకోగా.. ఆ తర్వాత హైదరాబాద్ లోని నారాయణ విద్యాసంస్థల్లో చదివారు. ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్నేహిత్ రెడ్డి దిశతో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు మహిపాల్ రెడ్డి సౌజన్యతోపాటు పెద్దనాన్న రమణా రెడ్డి ప్రోత్సాహం, సహకారంతో ఈ ర్యాంకును సాధించినట్లు పేర్కొన్నారు.


Next Story