- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిన్నారులకు ఆసరాగా నిలిచిన చిన్ననాటి మిత్రులు

దిశ, నిర్మల్ కల్చరల్: చిన్ననాడు బడిలో చదువుకున్న బాల్యమిత్రులంతా కలిసి ఇటీవలే అకాల మరణం చెందిన తమతోటి స్నేహితురాలి పిల్లలను ఆదుకుని ఆర్థిక చేయూతనందించారు. ఆదివారం ఆ మిత్రులంతా కలిసి రూ.2 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ బాండును ఆమె పిల్లలకు అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన జ్ఞానదాయిని ఉన్నత పాఠశాల 1996-97 బ్యాచ్ విద్యార్థుల బృందంలోని తమతోటి స్నేహితురాలు గాండ్ల సుజాతతోపాటు ఆమె భర్త రత్నాకర్ ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు వైష్ణవి, రాహుల్ లకు ఆర్థికంగా చేయూతనివ్వాలని నిర్ణయించారు. తమ బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా కలిసి రూ.2 లక్షలు సమీకరించి ఆ చిన్నారుల పేరిట బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూండ్రు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బాసటగా నిలిచిన పూర్వ విద్యార్థుల బృందాన్ని పలువురు అభినందించారు.