- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి
![ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి](https://www.dishadaily.com/h-upload/2022/03/08/99392-accident.webp)
దిశ, కూకట్పల్లి: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఓ సేల్స్మెన్ మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి ఎస్సై సురేష్తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన షేక్యూసుఫ్ (26) మియాపూర్లోని బజాజ్ఎలక్ట్రానిక్స్షోరూం లో శాంసంగ్ మొబైల్స్సేల్స్మెన్గా పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి యూసుఫ్బోరబండలోని తన ఫ్రెండ్ఇంటికి వెళ్తున్నాను రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తానని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు స్నేహితుడి ఇంటి నుంచి యూసుఫ్ తన TS-10-BF-8062 నంబర్ హోండా యాక్టీవా వాహనంపై బయలుదేరాడు. మూసాపేట్నుంచి బాలానగర్ వైపుకు వెళ్తుండగా వై జంక్షన్లో TS-16-EK-7696 నెంబరు గల బజాజ్అవెంజర్ వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో యూసుఫ్ను ఢీకొట్టాడు.
ఈ క్రమంలో యూసుఫ్ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి మూసాపేట్ నుంచి కూకట్పల్లి వైపు వెళుతున్న కంటైనర్తో లారీ వెనుక చక్రాల కింద పడటంతో లారీ చక్రాలు యూసుఫ్ శరీరంపై నుంచి వెళ్లింది. దీంతో యూసుఫ్అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యూసుఫ్మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యూసుఫ్ మృతి చెందిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందించారు. యూసుఫ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవెంజర్వాహనం నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమై అవెంజర్ వాహనం నడుపుతున్న వ్యక్తి ప్రమాదం సమయంలో మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు దృవీకరించారు.