టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల..

by Disha Web Desk 13 |
టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల..
X

దిశ, పాలకుర్తి : గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేవని బసంత్ నగర్ హెచ్‌కెఆర్ టోల్ ప్లాజా వద్ద గోదావరిఖని బస్ డిపోకు చెందిన బస్సులను నిలిపివేశారు. టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు ఫాస్ట్ ట్యాగ్ నగదు లేనందున.. ఆర్టీసీ బస్సులను నిలిపి వేయడం జరిగిందని తెలిపారు. రాజీవ్ రహదారి గుండా పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో.. కరీంనగర్, గోదావరిఖని వెళ్లవలసిన వాహనాలు ఎక్కడికక్కడే కొంతసేపు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.




Next Story

Most Viewed