- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మందు తాగి బండి నడిపినందుకు రూ. 6.5 లక్షల జరిమానా

దిశ, గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ పరిధిలో తనిఖీలలో పట్టుబడిన మందు బాబులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు నాగరాజు, కమలాకర్ లు తమ సిబ్బందితో గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలపై వారికి వివరించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే అధిక మొత్తంలో జరిమానాలు విధించడమే కాకుండా, జైలు శిక్ష కూడా పడుతుందని.. లైసెన్సులు రద్దవుతాయని హెచ్చరించారు. లోక్ అదాలత్ లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 625 మంది వాహనదారులకు సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని, జి.ఎస్.ఎల్ ప్రియాంక ముందు హాజరుపరుచగా 600 మందికి రూ. 1000 చొప్పున జరిమానా, 25 మందికి రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6,50000 జరిమానా విధించారు. భవిష్యత్ లో మరోసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. లోక్ అదాలత్ లో భాగంగా 625 కేసులు క్లోజ్ చేయడంలో విశేష కృషి చేసిన ఎస్సైలు నాగరాజు, కమలాకర్, కోర్టు కానిస్టేబుళ్లు బుర్ర శ్రీనివాస్, రమేష్ లను ట్రాఫిక్ సీఐ అభినందించారు.