రేవంత్ రెడ్డి కి మతి భ్రమించింది: గీత మూర్తి

by Mahesh |
రేవంత్ రెడ్డి కి మతి భ్రమించింది: గీత మూర్తి
X

దిశ, అంబర్ పేట్: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భరతమాత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. భరత మాతకు బీజేపీ కి లింక్ పెట్టి మాట్లాడడం సరైంది కాదన్నారు.

రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉద్దేశపూర్వక మైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలన్నింటికీ చాటి చెబుతున్న భారతదేశాన్ని భరతమాత అనడం భారతీయులందరికీ హక్కు అన్నారు. రేవంత్ రెడ్డి కి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి భరతమాత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.



Next Story