వామ్మో మంత్రి ప్రోగ్రామా..? నాలుక కరుచుకుంటున్న జనం

by S Gopi |
వామ్మో మంత్రి ప్రోగ్రామా..? నాలుక కరుచుకుంటున్న జనం
X

దిశ, బడంగ్ పేట్: సమాజంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, ఇండ్లకే పరిమితమయ్యే మహిళలు నేడు సమాజాన్నే చక్కదిద్దే స్థాయికి ఎదిగారని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే తెలంగాణ రాష్ట్ర మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేడు మహిళా బంధువయ్యారన్నారు. జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరాఠాభవన్​లో ఆదివారం జరిగిన అంతజర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఆశా వర్కర్లు కేసీఆర్ ఫ్లకార్డులతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్​కటౌట్​కు రాఖీ కట్టి తన అనుబంధాన్ని చాటారు. కేసీఆర్​మహిళా బంధువు సందర్భంగా మహిళా పోలీసులు, పారిశుద్ధ్య మహిళా కార్మికులు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఆశావర్కర్లు, పలువురు మహిళలకు పూలదండలు వేసి, చీరలు అందజేశారు. అనంతరం శాలువా కప్పి మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేసీఆర్ పేరు ఆకృతిలో మహిళలు చేపట్టిన ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళా బంధుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక మైలురాళ్లను అధిగమించడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మహిళలకు భద్రత ఇస్తూ భరోసా కల్పిస్తూ షీ టీమ్ లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. షీ టీమ్ ల పనితీరు వల్ల నేడు మహిళలు ధైర్యంగా బయట తిరుగగలుగుతున్నారన్నారు. కేసీఆర్ కిట్ లు 11 లక్షల మందికి రూ. 1700 కోట్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల ద్వారా ఇప్పటివరకు 10 లక్షల 27 వేల 270 మంది లబ్ధిదారులకు రూ. 9 వేల కోట్ల రూపాయలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అహ్మద్​సాధీ, వైస్​చైర్మన్​ఫర్హాణా నాజ్, కౌన్సిలర్లు పల్లపు శంకర్, లక్ష్మీనారాయణ, శంషుద్దీన్, భాషమ్మ, ఫమీదా అఫ్జల్, కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్​పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్బాల్ ఖలీఫా, వర్కింగ్​ప్రెసిడెంట్​ యంజాల జనార్థన్, నాయకులు నాగేష్, యంజాల అర్జున్, దూడల శ్రీనివాస్​గౌడ్, సత్తిరెడ్డి, వాసు బాబు, అర్జున్ మాదిగ, షేక్​అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

సమయపాలన పాటించని మంత్రి ? వామ్మో మంత్రి ప్రోగ్రామా ?

జల్​పల్లి మున్సిపాలిటీలోని మరాఠాభవన్​లో జరుగనున్న అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదివారం ఉదయం 11.30 గంటలకు హాజరు కానున్నట్లు షెడ్యూల్​ప్రకటించారు. అయితే షెడ్యూల్​కన్నా గంట ముందే మహిళలు మరాఠాభవన్​కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ చేతబూనిన కేసీఆర్ ఫ్లకార్డులతో మంత్రికి స్వాగతం పలకడానికి ఎదురుచూడసాగారు. అరగంట.. గంట ఆలస్యం కాదు ఏకంగా మూడు గంటల 15 నిమిషాలకు మంత్రి సభావవేదికకు ఆలస్యంగా రావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఆలస్యం కావడానికి ఇదేం కొత్త కాదని.. తరచూ ప్రారంభోత్సవాలకు షెడ్యూల్​లో ప్రకటించిన సమయానికి కాకుండా ఆలస్యంగా రావడం మంత్రి వంతయ్యింది. వామ్మో మంత్రి ప్రోగ్రామ్​కా అంటూ కొంతమంది నాలుక కరుచుకుంటున్నారు.



Next Story

Most Viewed