ఏపీ ప్రజలకు ప్రధాని సర్‌ప్రైజ్.. భీమవరంలో పాటపాడిన మోడీ

by Disha Web Desk 2 |
ఏపీ ప్రజలకు ప్రధాని సర్‌ప్రైజ్.. భీమవరంలో పాటపాడిన మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని సన్మానించారు. ఈ సందర్భంగా పెదఅమీరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముందుగా ''తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా'' అంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి, తెలుగులోనే ప్రధాని అల్లూరిని కొనియాడటం అందరినీ ఆశ్చార్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed