- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి.. వచ్చే నెలలో...

దిశ, మణుగూరు: 'కంగారు పడకండి.. పేదప్రజల కోసం కష్టపడి పనిచేయండి.. రాజకీయం నేను చూసుకుంటా..' అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, మణుగూరు నాయకులకు సూచించారు. శనివారం ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం, పలు మండలాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకులతో మాట్లాడుతూ.. గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు. వచ్చే 2023 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో రాజకీయం ఏవిధంగా ఉంటుందో మీరే చూడండి అంటూ నాయకులతో సంచలన వ్యాఖ్యలు చేశారని కొంత విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో పినపాక గురించి కొన్ని గంటల పాటు చర్చలు జరిపారని నాయకుల ద్వారా కొంత టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాకపై గురి పెట్టారని కొంత సమాచారం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, మణుగూరు వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, ఉపసర్పంచ్ ఎస్.కే బాజీ, కటుకూరి శ్రీనివాసరావు, పునెం చంద్రశేఖర్, తమ్మిశెట్టి సాంబ, బల్లెం సురేష్, హరిశంకర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.