ఆ ప్రయాణం వద్దని దండం పెట్టిన పోలీస్..

by Mahesh |
ఆ ప్రయాణం వద్దని దండం పెట్టిన పోలీస్..
X

దిశ, భిక్కనూరు : దండం పెట్టి చెబుతున్నా.. ప్రమాదకర ప్రయాణం వద్దు.. సురక్షిత ప్రయాణం ముద్దు అంటూ దోమకొండ ఏఎస్ఐ లింబాద్రి వినూత్న తరహాలో ద్విచక్ర వాహనదారుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దోమకొండ మండలం అంచనూర్ డంపింగ్ యార్డ్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై భార్య, ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టుకొని, మూడు బ్యాగులను హైండిల్‌కు వేసుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి కామారెడ్డికి ప్రమాదకరంగా వెళ్తున్నాడు. నెల క్రితం ఇదే ప్రాంతంలో ప్రమాదకర ప్రయాణం చేసి భార్యాభర్తలు మృతి చెందారని, ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారని వివరిస్తూ.. మరోసారి ప్రమాదకర ప్రయాణం చేయవద్దని ఏఎస్ఐ లింబాద్రి.. ఆ ద్విచక్ర వాహనదారుడుకి అవగాహన కల్పించారు.



Next Story