- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మానవత్వం చాటుకున్న పోలీసులు.. ప్రశంసల వెల్లువ

దిశ, తిరుమలాయపాలెం: పోలీస్ ఉద్యోగం నిరంతరం సవాళ్లతో కూడుకున్నది. ఎన్నో రకాల వత్తిడుల నడుమ విధి నిర్వహణలో ప్రజలకు రక్షణ కల్పిస్తుంటారు. రక్షణ మాత్రమే కాదు మానవత్వం సైతం తమలో మెండుగా ఉన్నది అని పోలీస్ అన్నలు చాటి చెప్పిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామ శివారు పెట్రలో బంక్ సమీపాన మతిస్థిమితం కోల్పోయి ఓ వ్యక్తి అన్నపానీయాలు లేక రోడ్డు వెంబడి తిరుగుతుండగా, అటుగా వెళ్లే వాహనదారులు ఎవరు కూడా పట్టించుకోకుండా పోతున్నారు. అయితే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తిరుమలాయపాలెం పోలీస్ కానిస్టేబుల్స్ పున్నయ్య, హరికృష్ణలు ఆ వ్యక్తిని చూసి చలించిపోయారు. బట్టలు తొడిగి, మంచి నీరు త్రాగించారు. నీరసంగా ఉన్న వ్యక్తికి తినడానికి పండ్లు కొనిచ్చారు. ఆ వ్యక్తి పట్ల పోలీస్ అన్నలు చాటిన మానవత్వం పట్ల స్టేషన్ ఎస్సై బి. గిరిధర్ రెడ్డి, కానిస్టేబుల్స్ హరికృష్ణ, పున్నయ్య, వెహికల్ డ్రైవర్ బాలరాజును అభినందించారు. అందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అవ్వి కాస్త వైరల్ కావడంతో పోలీసులు చేసిన మంచి పనికి ప్రశంసలు వెల్లువెత్తాయి.