- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని అర్థం చేసుకోలేదు : రాహుల్ గాంధీ
తిరువనంతపురం: మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోడీ పూర్తిగా అర్థం చేసుకోలేదని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్ లో మీడియాతో మాట్లాడారు. 'ప్రధాని మోడీ వ్యాఖ్యలు తనను షాక్ కు గురిచేయాలని చెప్పారు. లోక్సభలో ప్రధాని మోడీ ఉపాధి హామీ పథకంపై మాట్లాడుతున్నపుడు నేను షాక్ అయ్యాను. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలలో సజీవ శిలగా దీనిని వర్ణించారు.
ఖజానాకు గండి పడుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆ పథకంపై ఎలాంటి అవగాహాన లేదని నాకు అర్థం అయింది' అని చెప్పారు. దేశంలోని లక్షలాది ప్రజలకు ఉపాధి హామీ చివరి అస్త్రమని, భారీ రక్షణ అని ప్రధాని అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. భారతీయ కార్మిక మార్కెట్ లో ఉపాధిహామీ శాశ్వత మార్పులు తీసుకొచ్చిందనే విషయం ప్రధానికి అర్థం కాదని అన్నారు. 2015లో లోక్ సభలో ఉపాధి హామీ పథకంపై ప్రధాని మోడీ మాట్లాడారు. పథకాన్ని యూపీఏ వైఫల్య చిహ్నాంగా వర్ణించారు.