అతిసారతో వృద్ధురాలు మృతి

by Dishanational1 |
అతిసారతో వృద్ధురాలు మృతి
X

దిశ, బెజ్జుర్: అతిసార వ్యాధితో మండలంలో ఒకరు మృతి చెందారు. బెజ్జూర్ మండలం సలుగుపెళ్లి గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు బాయ్(70) అనే వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది. గత మూడు రోజుల క్రితం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. గ్రామస్తులను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించినట్లు తెలిసింది.


Next Story

Most Viewed