- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోన్న ఎన్ఐఏ దాడులు.. రాజస్థాన్ మర్డర్తో లింక్..?
దిశ, చార్మినార్: హైదరాబాద్లోనిపాతబస్తీ సంతోష్నగర్లో ఎన్ఐఎ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంతోష్నగర్పోలీస్స్టేషన్పరిధిలోని ఖలిందర్నగర్లో మదర్సాతోహిద్ సెంటర్ మతగురువు మొహమ్మద్మనోవర్ హుస్సేన్ అస్రఫి ఇంట్లో ఎన్ఐఎ అధికారులు దాడులు నిర్వహించారు. మదర్సాతోహిద్సెంటర్తో పాటు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొహమ్మద్మనోవర్హుస్సేన్అస్రఫితో పాటు మరో వ్యక్తిని ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం వారిని వదిలి పెట్టారు. ఈ నెల 14వ తేదీన జైపూర్లోని ఎన్ఐఎ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది. గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మనోవర్హుస్సేన్అస్రఫికి ఫోన్చేసినట్లు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు.
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇటీవల ఉదయ్పూర్కు చెందిన దర్జీ కన్నయ్య లాల్ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ప్రభుత్వం కేసును ఎన్ఐఏకి అప్పగించింది. అదే సమయంలో కన్నయ్యను హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయ్పూర్ హత్య కేసులో నిందితులు ఫోన్చేసిన వారిలో ఉన్నారన్న అనుమానంతో మనోవర్హుస్సేన్అస్రఫిని ఎన్ఐఎ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది. మనోవర్హుస్సేన్ అస్రఫికి ఫోన్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మహ్మద్ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి శిక్షలు ఉంటాయని అని అడిగినట్లుగా తెలుస్తోంది.