ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోన్న ఎన్ఐఏ దాడులు.. రాజస్థాన్ మర్డర్‌తో లింక్..?

by Disha Web Desk 19 |
ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోన్న ఎన్ఐఏ దాడులు.. రాజస్థాన్ మర్డర్‌తో లింక్..?
X

దిశ, చార్మినార్: హైదరాబాద్‌లోని​పాతబస్తీ సంతోష్​నగర్‌లో ఎన్ఐఎ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంతోష్​నగర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని ఖలిందర్​నగర్‌లో మదర్సాతోహిద్​ సెంటర్ మతగురువు మొహమ్మద్​మనోవర్ హుస్సేన్ అస్రఫి ఇంట్లో ఎన్ఐఎ అధికారులు దాడులు నిర్వహించారు. మదర్సాతోహిద్​సెంటర్‌తో పాటు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొహమ్మద్​మనోవర్​హుస్సేన్​అస్రఫితో పాటు మరో వ్యక్తిని ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం వారిని వదిలి పెట్టారు. ఈ నెల 14వ తేదీన జైపూర్‌లోని ఎన్ఐఎ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది. గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మనోవర్​హుస్సేన్​అస్రఫి‌కి ఫోన్​చేసినట్లు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు.

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇటీవల ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్నయ్య లాల్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ప్రభుత్వం కేసును ఎన్ఐఏకి అప్పగించింది. అదే సమయంలో కన్నయ్యను హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయ్​పూర్ హత్య కేసులో నిందితులు ఫోన్​చేసిన వారిలో ఉన్నారన్న అనుమానంతో మనోవర్​హుస్సేన్​అస్రఫిని ఎన్ఐఎ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది. మనోవర్​హుస్సేన్ అస్రఫికి ఫోన్​చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మహ్మద్​ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి శిక్షలు ఉంటాయని అని అడిగినట్లుగా తెలుస్తోంది.



Next Story