- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈర్ల సమ్మయ్యకు జాతీయ ప్రతిభా పురస్కారం

దిశ, కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆదివారం మంథనిలో 'జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం' అందుకున్నారు. గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జానకి రామ కళ్యాణ వేదిక మంథనిలో నిర్వహించిన మహాకవి సమ్మేళనంలో ఈర్ల సమ్మయ్యకు జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారంతోపాటు 'కవి రత్న' బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు దూడపాక శ్రీధర్, ఎస్వీఆర్ వెంకటేష్ లు ఆయనను ప్రతిభా పురస్కారంతోపాటు శాలువా, పూలమాలలు, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈర్ల సమ్మయ్య దశాబ్ధ కాలంగా విద్య, సాహిత్యం, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. మూతపడే స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచి, ఆ పాఠశాల కొనసాగేలా చేశారు. పాఠశాలలో కృత్యాధార, భావనల ఆధారిత, నాణ్యమైన బోధన అందిస్తూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు. దాతలు, ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలకు కావలసిన భౌతిక, మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పిల్లల్లో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలో వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు. పాఠశాలలో పిల్లల కోసం వివిధ బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసి, వారిలో సృజనాత్మకత శక్తిని పెంపొందింపజేస్తున్నారు పాఠశాల ఏరియాలో నిరక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువతకు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.
కరోనా మహమ్మారి, ఇతర ప్రకృతి వైపరీత్యాల బారినపడిన ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను సృష్టించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశంలోని తెలుగు వారి చేత తెలుగు కవితలు రాయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మేఘనా సాహితీ కళా వేదిక అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా వందలాది మంది కవులు, కవయిత్రులకు ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వివిధ సాహితీ ప్రక్రియల్లో కవితలు రాస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ రంగాల్లో ఈర్ల సమ్మయ్య చేస్తున్న సేవలను గుర్తించిన గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ నిర్వాహకులు దూడపాక శ్రీధర్, ఎస్వీఆర్ వెంకటేష్ ఆయనకు జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారంతోపాటు 'కవిరత్న' బిరుదు అందించి, సత్కరించారు. జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని, పురస్కారానికి ఎంపిక చేసిన దూడపాక శ్రీధర్, ఎస్వీఆర్ వెంకటేష్ లకు ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం పొందిన ఈర్ల సమ్మయ్యను మిత్రులు, శ్రేయోభిలాషులు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు, గ్రామ ప్రజలు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు అభినందించారు.