ఆ విషయంలో తెలుగువాడిగా గర్వపడుతున్నా: లోకేశ్

by Disha Web Desk 2 |
ఆ విషయంలో తెలుగువాడిగా గర్వపడుతున్నా: లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరణ జరుగడంతో ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నారని అన్నారు. బ్రిటీషు నిరంకుశ పాలనలో అమాయక గిరిజనులు నలిగిపోతుంటే.. వారిలో అల్లూరి ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చారన్నారు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి ఆంగ్లేయుల గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమని అన్నారు.


Next Story