- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ హెచ్చరిక
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు అందజేసింది. బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆమంచి కృష్ణమోహన్ సీబీఐ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాము సూచించిన రోజే విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఎప్పుడు విచారణకు హాజరుకావాలో త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
ఇకపోతే సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్కు సీఆర్పీసీ 41ఏ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమంచి కృష్ణమోహన్ విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేయగా తాను హాజరుకాలేనని చెప్పుకొచ్చారు. ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని వారం రోజులు సమయం ఇస్తే హాజరవుతానని సీబీఐకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇకపై తాము ఎప్పుడు చెప్తే అప్పుడు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.