ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించే అవకాశం..!

by Dishanational1 |
ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించే అవకాశం..!
X

ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన వారసులకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియను ప్రారంభించారు. మంగళవారం ఆయన తనయుడు ఆకాశ్ అంబానీకి టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కుమార్తె ఈశా అంబానీకి రిలయన్స్ రిటైల్ బాధ్యతలను బదిలీ చేయనున్నట్టు పలు నివేదికలు అభిప్రాయపడ్డాయి. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే ఈశా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, జియో బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2016లో రిలయన్స్ రిటైల్ అనుబంధంగా అజియో ఫ్యాషన్ రిటైల్‌ను ప్రారంభించారు. కాగా, ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిన ఈశా అంబానీ అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఏల్ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీయే చేశారు.



Next Story