- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దళితులకు అంత డబ్బు వద్దన్న ఎమ్మెల్యేలు.. కేసీఆర్ ఏం అన్నారంటే..?

దిశ, తుంగతుర్తి: దళిత బంధు లాంటి పథకం ఆలోచన వంద జన్మలెత్తినా ఎవరికి కూడా తట్టదని, ఆ ఘనత దేశంలోనే సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కిందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పునరుద్ఘాటించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో దళిత బంధు లబ్ధిదారులకు వివిధ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకం పై తొలిసారిగా పదిన్నర గంటల పాటు ఏకధాటిగా జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ రెండు గంటలపాటు ఉపోద్ఘాతం ఇవ్వడం చారిత్రాత్మమనీ అన్నారు. చివరికి దళిత బంధు పథకానికి 10 లక్షలు ఇస్తున్నట్టు చెప్పడం తో సభకు హాజరైన వారంతా "షాక్" తిన్నారని, అయితే ఒక సందర్భంలో ఒక్కొక్కరికి అంత డబ్బు వద్దని చెబితే కేసీఆర్ కోపంతో మమ్మల్ని తిట్టారని ఆయన వివరించారు.
దళిత బందుతో యావత్ దేశం రాష్ట్రం వైపు చూస్తోందని, ఇలాంటి పథకాలు మన వద్ద ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్న వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా 9.90 లక్షలు లబ్ధిదారునికి మిగిలిన 10 వేలు దళిత రక్షక నిధిలోకి వెళ్తాయని వివరించారు. ప్రస్తుతం వ్యాపారంలో నష్టపోయిన వారిని మరోసారి ఆదుకునేందుకు ఈ రక్షణ నిధి పనికొస్తుందని పేర్కొన్నారు. దళిత బందు మంజూరు కోసం ఎవరికీ కూడా లంచాలు ఇచ్చి మోసపోరాదని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తనదే కాబట్టి పైరవీకారుల మాట తాను వినేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు,జాయింట్ కలెక్టర్ మోహన్ రావు,పిడి కిరణ్ కుమార్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం,తహశీల్దార్ రాంప్రసాద్,ఎంపీడీవో భీమ్ సింగ్,వైస్ ఎంపీపీ శ్రీశైలం, డిసిసిబి డైరెక్టర్ సైదులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు, గౌడిచర్ల సత్యనారాయణ, దేవాలయ, గ్రంధాలయాల చైర్మన్ లు ముత్యాల వెంకటేశ్వర్లు, గోపగాని రమేష్, తదితరులు పాల్గొన్నారు.