ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

by Dishafeatures2 |
ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
X

దిశ, దౌల్తాబాద్ : మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం రోజున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు . కార్యాలయ సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ ను డిప్యుటేషన్‌పై గజ్వేల్ వెల్లడం పట్ల జడ్పీ సీఈఓ రమేష్‌కి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కనీసం సమాచారం లేకుండా జడ్పీ సీఈవో ఇష్టారీతిగా వ్యవహరిస్తునారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కోసం కృషి చేస్తానని అన్నారు. అయినా వెంట ఎంపీపీ సంధ్యా, నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, నరసింహ రెడ్డి, ముత్యాల శ్రీను, రంజిత్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed