- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మిషన్ భగీరథ వాటర్ పూర్తిగా సురక్షితం.. డిఇ శ్యాం గుప్తా

దిశ: బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ మంచి నీటిని నిరంతరంగా ప్రభుత్వం ఆదేశానుసారం గా శుద్దమైన జలం అందిస్తున్నామని మిషన్ భగీరథ జిల్లా డిఇ శ్యాం గుప్తా అన్నారు. సోమవారం మండలంలోని 32 పాత వాటర్ ట్యాంకులు, కొత్తవి 66 వాటి నుండి మండలం లోని ప్రతి గ్రామంలో కుళాయిల ద్వారా నీటి శ్యాంపిల్ సేకరించినట్లు వాటర్లో పిహెచ్ విలువలు, క్లోరినేషన్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ టీం సభ్యులు అనిల్, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఇ వేణు గోపాల్ రెడ్డి పాల్గొని వాటర్ శాంపిల్ సేకరించి వాటిని జిల్లా కేంద్రంలో పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డిఇ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ స్కీం నుండి ప్రతిరోజు మండలం లో 12600 కనెక్షన్లకు మంచి నీటిని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రోజు 1,91 వేల మిలియన్ల లీటర్ల నీటిని 1 లక్షా 81 వేల కుళాయిల ద్వారా మంచి నీటిని అందిస్తున్నామని అన్నారు. సంవత్సరంలో మూడు సార్లు మిషన్ భగీరథ నీటిని పరీక్షలు చేస్తున్నామన్నారు. గత వారం రోజులుగా 3,600 వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అందరు తాగేందుకు మిషన్ భగీరథ నీరును ఉపయోగించుకోవాలని అన్నారు.
మిషన్ భగీరథ గ్రిడ్ కింద మెరుగైన సేవలు కోసం ప్రభుత్వానికి ఆదేశాలు పంపనున్నట్లు తెలిపారు. కొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీటిని ఉపయోగించడం లేదని వాటిని గుర్తించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జల జీవన్ మిషన్ పూర్తిగా వినియోగంలోకి తేవడం లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇ శ్రీజ, సెక్రటరీ శ్రీధర్, సర్పంచ్ కోటమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.