- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ట్యాంక్బండ్ నుండి ఇందిరా పార్క్కు రోప్వే.. వారి దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి

దిశ, ముషీరాబాద్ : ట్యాంక్ బండ్ నుండి ఇందిరా పార్క్లోకి రోప్వే నిర్మాణ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మనం జరుపుకునే పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్తాయని అన్నారు. హోలీ సందర్భంగా ఇందిరా పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ, బిజెపి ఓబీసీ మోర్ఛ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్, దైవజ్ఞ శర్మలతో కలిసి హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేసి వేడుకల్లో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. యువత కూడా విజిల్స్, కేకలు వేస్తూ మంత్రితో పాటు డ్యాన్స్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని, వాకర్స్ సమస్యలను కూడా ఎన్నో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ఇందిరాపార్క్లో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు దేశం మొత్తం ఎంతో సంతోషంగా హొలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించే విధంగా అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.