మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: మంత్రి మల్లారెడ్డి

by Vinod kumar |
మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: మంత్రి మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ముందస్తు మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఆదివారం పోచారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, కీసర గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆశా వర్కర్స్, మహిళా సంఘాల ప్రతినిధులకు చీరలు, స్వీట్స్ పంపిణీ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని తెలిపారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టింది. ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రసవానికి ముందు, ప్రసవం సమయంలో, ప్రసవం తర్వాత అవసరమైన అన్ని రక్షణ కార్యక్రమాలను ఇందులో చేయడం జరుగుతుంది.

మహిళా సంక్షేమం కోసం ఇంత నిబద్ధతతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి 1700 కోట్ల లబ్ధి.. ఒక్కొక్కరికి 13 వేల లబ్ధి చేకూరుతుంది. కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశు మరణాలు తగ్గాయి.. ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయి. కల్యాణ లక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు 9022 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెళ్లి కానుక అందజేయడం జరిగింది. మన ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నది, వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం తో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. 70 లక్షల హెల్త్, హైజెనిక్ కిట్లను విద్యార్థులకు అందించడం జరిగింది. ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా, జవహర్ నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, ప్రణీత గౌడ్, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాధవ రెడ్డి, నరేందర్ రెడ్డి, పార్టీ మహిళా నాయకురాలు షాలిని మహేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed