- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TRS ఎమ్మెల్యేపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం
దిశ, కూకట్పల్లి: రహదారులు, రవాణా వ్యవస్థే నగర అభివృద్ధి, ప్రగతికి సూచకలని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.86 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వోబీని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజే, సురభి వాణీదేవి, కలెక్టర్ హరీష్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యుటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ మమతలతో కలిసి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రహదారులు, రవాణ వ్యవస్థనే సూచికలని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 8052 కోట్ల నిధులతో ఎస్ఆర్డీపీ మొదటి విడత కింద నగరంలో ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, రహదారుల పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఎస్ఆర్ డీపీ కింద తీసుకున్న 47 పనుల్లో కైత్లాపూర్ 30వ ఆర్వోబీని నేడు ప్రారంభించామని, మిగిలిన 17లో ఈ ఏడాదిలో మరో 6 ఫ్లైఓవర్లు, వచ్చే ఏడాదిలో మిగిలిన వాటిని ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పని చేస్తున్నామని అన్నారు. ఎస్ఆర్డీపీ రెండో విడత కింద రూ.3115 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును అభినందనలతో ముంచెత్తారు. కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాటు పడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. డబుల్ బెడ్రూంలు, పించన్ల గురించి ఎమ్మెల్యే విన్నవించారని, త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమై డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు అందించే విషయంపై చర్చిస్తానని అన్నారు. అదే విధంగా బాలానగర్లో ఇండస్ట్రీస్ ఎస్టేట్కు ఇచ్చిన 45 ఎకరాల భూమిలో నుంచి 5 ఎకరాలు వంద పడకల ఆసుపత్రికి కేటాయించాలని ఎమ్మెల్యే కోరారని, త్వరలో వైద్యశాఖ మంత్రి హరీష్ రావుతో మాట్లాడి త్వరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించుకునేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేకర్ రెడ్డి, పాటిమీది జగన్, గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్, కూనా వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్లు సబీహ బేగం, పగుడాల శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్ గౌడ్, రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహా యాదవ్, మందాడి శ్రీనివాస్ రావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ.గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, కాండూరి నరేంద్ర చార్యా, బాబురావులు పాల్గొన్నారు.
పెళ్లి బరాత్లా ఉంది: కేటీఆర్
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు గులాబీ తలపాగాలు, గులాబీ కండువాలు, కళాకారుల నృత్యాలతో మంత్రి కేటీఆర్కు స్వాగతం పలకడంతో కేటీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ సభా ప్రాంగణానికి వస్తుంటే పెళ్లి బరాత్లో వస్తున్నట్టు అనిపించిందని, కూకట్పల్లి టీఆర్ఎస్ శ్రేణులు ఎంతో వైభవంగా సభను నిర్వహించడం అనందంగా ఉందని అన్నారు.
ఆయా డివిజన్ల నుంచి భారీ బైక్ ర్యాలీలు:
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి, బాలానగర్, ఓల్డ్ బోయిన్పల్లి, ఫతేనగర్, అల్లాపూర్, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ, బేగంపేట్ డివిజన్ల నుంచి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వేలమంది నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సభ ప్రాంగణానికి తరలి వచ్చారు. సభలో సుమారు 20 వేల మంది పైగా హాజరయ్యారు.