- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆడవాళ్లతో సమానంగా హక్కులు కల్పించాలి..ఢిల్లీలో పురుషుల సత్యాగ్రహం

దిశ,వెబ్ డెస్క్: మహిళలతో పాటు పురుషులకూ సమాన హక్కులు ఉండాలంటూ, దీక్ష చేయడం కోసం మగవారి హక్కుల కోసం పోరాటం చేసే కార్యకర్తలు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు రైల్వే స్టేషన్లో ప్లెక్సీని ప్రదర్శిస్తూ స్లోగన్స్ వినిపించారు. స్త్రీల కోసం కమిషన్ ఉన్నట్టే పురుషుల కోసం మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం అంటూ ప్లెక్సీని ప్రదర్శించారు.
సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య మగవారిపై సైతం దారుణాలు పెరిపోతున్న సంగతి తెలిసిందే. మగవారిని ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు లేకపోవడంతో వారికి అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కారణం లేకున్నా కొందరు భార్యలు భర్తలపై గృహ హింస లాంటి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అక్రమసంబంధాలు సైతం పెరిగిపోయాయి. దీంతో ప్రియుడితో కలిసి భర్తలను హతమారుస్తున్న కేసులు సైతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే స్త్రీల కోసం మహిళా కమిషన్ ఉన్నట్టుగా పురుషుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్ల నేపథ్యంలో పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా చట్టాలు, పురుషుల కమిషన్ ఏర్పాటు చేస్తారామో చూడాలి.