- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
by S Gopi |

X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం హనుమాన్ టెంపుల్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్లితే... అశ్వాపురం మండలం చవిటిగూడెం గ్రామానికి చెందిన నారు వీరేందర్ అనే వ్యక్తి అశ్వాపురం మండలం నుంచి మణుగూరు మండలం వైపు వెళ్తుండగా హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story