పుట్టింటికి వెళ్లిన భార్య.. ఒంటరి జీవితం భరించలేక భర్త ఆత్మహత్య

by S Gopi |
పుట్టింటికి వెళ్లిన భార్య.. ఒంటరి జీవితం భరించలేక భర్త ఆత్మహత్య
X

దిశ, భిక్కనూరు: ఒంటరి జీవితం భరించలేక.. తాగుడుకు బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన తునికి రాజు(40) ప్లంబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల కిందట భార్య సరితతో గొడవ పెట్టుకోవడంతో ఆమె తన ఇద్దరు పిల్లల్ని రోహన్, రిషితలను వెంటబెట్టుకొని కామారెడ్డిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి రాజు ఒంటరి జీవితం భరించలేక తాగుడుకు బానిసయ్యాడు. గురువారం మధ్యాహ్నం తన తల్లి మెదక్ జిల్లా చేగుంటలోని తన కూతురు ఇంటికి వెళ్ళింది. తాగుడుకు బానిసైన రాజు ఒంటరి జీవితం గడపలేక తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఆనంద్ గౌడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.



Next Story

Most Viewed