- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెళ్లై అత్తారింటికి వెళ్లిన మరదలు.. సడెన్గా చెట్ల పొదల్లో కనిపించడంతో..

దిశ, వెబ్ డెస్క్: పెళ్లై అత్తింట్లో కాపురం చోసుకుంటున్న ఓ యువతిని ఆమె మేనబావ లేపుకెళ్లాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. దీంతో ఆమె గర్భవతి అని తేలడంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు విచారణగా చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని జెహనాబాద్ కు చెందిన ఓ యువకుడు తన మేన మరదలిని ప్రేమించాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అనంతరం ఆ యువతికి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కావడంతో ఆ యువతి అత్తింట్లో కాపురం చేసుకుంటుంది. అయితే, ఆమెను అత్తింట్లో నుంచి ఆ యువకుడు కొన్ని నెలల కిందట తీసుకెళ్లాడు. వారిద్దరూ కలిసి ఓ ఇంట్లో సహజీవనం చేశారు. అయితే, ఆమె గర్భవతని తెలిసింది. ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తదని అతను ఆమె తలపై రాడ్డుతో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.