- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎస్ఐ ఫొటోలతో ఫేక్ ఇన్స్టాగ్రామ్.. మహిళల నుంచి డబ్బులు వసూలు..

దిశ, పర్వతగిరి: వరంగల్ కమిషనరేట్ లో పనిచేస్తున్న పర్వతగిరి ఎస్ఐ కిషోర్ కుమార్ ఫొటోలను ఫేస్ బుక్ నుండి డౌన్ లోడ్ చేసి ఆ ఫొటోలతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మహిళల నుండి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటికి చెందిన ఎంకాల ఆంజనేయులు అలియాస్ అంజి(35)కి 2006లో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు పిల్లలు.. అతని భార్య కువైట్ వెళ్లి అక్కడే ఉంటుంది. తన ఖర్చులకి, జల్సాలకి డబ్బులు పంపకపోవడంతో డబ్బులు లేక ఇలా ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లను క్రియేట్ చేసి అమ్మాయిలను పోలీస్ అధికారినని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి వందమందికి పైగా అమ్మాయిలతో చాట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఒక మహిళ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, వరంగల్ పోలీసు కమిషనర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ విశ్వేశ్వర్ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశాడో మిగతా వివరాలు తదుపరి విచారణలో బయటికి వచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్బంగా ఏసీపీ మామునూరు నరేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంకెవరైనా ఈ విధంగా మోసపోయి ఉంటే వెంటనే పర్వతగిరి పోలీసులకు తెలియజేయాలన్నారు. అంతేకాక ఏ పోలీసు అధికారి కూడా తనకు సహాయం చేయమని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా రిక్వెస్ట్ చేయరని, అలాంటి మెసెజ్ లు వస్తే ప్రజలు నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన సీఐ పర్వతగిరి విశ్వేశ్వర్, ఎస్ఐ కిషోర్, కానిస్టేబుల్ రాజ్ కుమార్, రాజులను ఏసీపీ మామునూరు నరేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.