'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ముగ్గురిపై దాడి

by Dishanational1 |
నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది అంటూ ముగ్గురిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: 'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై రాడ్డు దాడి చేశాడు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో తన పొరిగింటి కుక్క మొరుగుతోంది అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అంతేకాకుండా కుక్కపై కూడా దాడి చేశాడు. దీంతో కుక్కతోపాటు వారిందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా కూడా కాలనీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story