- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ పంటకు మార్కెట్ లో మద్దతు మించి ధర... ఎంతంటే?

దిశ, లోకేశ్వరం: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా వెచ్చించి మార్కెట్లో వ్యాపారులు మక్కలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మొక్కజొన్న సాగు చేసిన రైతుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఈ యాసంగి సీజన్ లో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో పెద్ద మొత్తంలో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపారు. దీంతో దిగుబడి పెరిగి మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాక దళారులు అడిగిన ధరలకు విక్రయించి ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని రైతుల్లో మొదట ఆందోళన రేకెత్తించింది. కానీ.. రైతుల అంచనాలను తలకిందులు చేస్తూ మొక్కజొన్నల ధర పరుగులు పెడుతోంది.
లోకేశ్వరం మండలంలో 6500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు..
గత యాసంగి సీజన్ లో మండలంలో రైతులు 2500 ఎకరాలకు మించి మొక్కజొన్న సాగు చేయకపోగా ఈ సీజన్ లో 6500 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు పంపారు. కానీ గత సంవత్సరం ప్రభుత్వం సీజన్ చివరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ. 1770 మద్దతు ధర కల్పించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసింది. కానీ.. రైతులు అప్పటికే దాదాపు మొక్కజొన్నలు క్వింటాల్ కు రూ. 1500 లోపు దళారులకు విక్రయించి నష్టపోయారు. పంట దిగుబడి తక్కువ ఉన్న గత యాసంగిలో మార్కెట్లో తక్కువ ధర లభించగా ఈసారి దిగుబడి ఎక్కువ ఉండడంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాక ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్న అన్నదాతకు ఈ ధరలు ఊరట నిస్తున్నాయి. ఏది ఏమైనా నా ఈ ధరలు చివరి వరకు ఉండాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.