దిశ కథనానికి స్పందించిన ఎంపీ కవిత

by S Gopi |
దిశ కథనానికి స్పందించిన ఎంపీ కవిత
X

దిశ, మహబూబాబాద్: మానుకోట పోస్టల్ శాఖలో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి, కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిడి తెస్తూ మానసింకంగా వేధిస్తున్నారని చేపల కూర తేకపోవడంతో ఆగ్రహంతో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలిగించి, ఎంపీ కవిత దగ్గరి బంధువుల అని బెదిరింపులకు పాల్పడగా బుధవారం " పోస్టల్ శాఖలో చేప ముక్కల లొల్లి" అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం విధితమే. కాగా బుధవారం ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత స్పందించి బాధితుడు నరేశ్ తో ఫోన్ లో మాట్లాడి ఉద్యోగం కోసం దిగులు పడొద్దని భరోసా కల్పించింది. ఉద్యోగం ఎటూ పోదని అధైర్యపడొద్దని తెలిపింది. పోస్టల్ అధికారికి తనకు ఎలాంటి బంధుత్వం లేదని తెలిపినట్లు నరేష్ తెలిపారు. ఈ విషయమై సదరు పోస్టల్ డివిజన్ అధికారి పని తీరు, వ్యవహార శైలిపై చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ (పీజీఎం)కు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపింది. అనంతరం దిశతో ఎంపీ కవిత ఫోన్ లైన్ లో మాట్లాడుతూ.. తన పేరు చెప్పి ఎవ్వరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పారదర్శకంగా ఉందని, ఎలాంటి పైరవీలు కు తావు ఉండదని తెలిపారు.



Next Story

Most Viewed