విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం

by Dishanational1 |
విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం
X

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్, మాజీ బీహార్ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి తీవ్రంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శరీరంలో ఎలాంటి కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. 'ఆసుపత్రిలో చేరిన రాజకీయ నాయకుడి శరీరంలో ఎటువంటి కదలికలు లేవు. ఆయన కండరాలు కీళ్ళలో ఎలాంటి స్పందన లేదు. లాలూజీ కోలుకోవాలని కుటుంబసభ్యులందరూ నమ్మకంగా ఉన్నారు' అని పేర్కొన్నారు. కిందపడిన తర్వాత లాలూకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. గాయాలతో ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువై కదల్లేకుండా ఉన్నారని చెప్పారు. అంతకుముందు బుధవారం రాత్రే పరిస్థితి విషమించడంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కి వాయు మార్గంలో తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న లాలూ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని వైద్య సిబ్బంది తెలిపారు.


Next Story