ఫైనాన్స్ దందాపై దాడులు.. 37 చోట్ల అటాక్

by samatah |
ఫైనాన్స్ దందాపై దాడులు.. 37 చోట్ల అటాక్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఫైనాన్స్ కేంద్రాలు, నిర్వాహకుల ఇళ్లతో పాటు పలు చిట్ ఫండ్ సంస్థలపై కరీంనగర్ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్ కమిషనరేట్‌లోని 37 చోట్ల ఏక కాలంలో దాడులు చేపట్టారు. దాడుల్లో అక్రమ వడ్డీ వ్యాపారులు చేస్తున్న చట్ట వ్యతిరేకంగా పాల్పడుతున్న తీరుపై డాక్యుమెంట్ ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఆయా ఫైనాన్స్ లు, నిర్వహకులకు సంబంధించిన రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వరకూ దాడులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.



Next Story

Most Viewed