గంజాయి మత్తు మాయలో తండ్రి దారుణం.. ఆడపిల్లల ప్రాణాలు సేఫ్

by Dishanational2 |
గంజాయి మత్తు మాయలో తండ్రి దారుణం.. ఆడపిల్లల ప్రాణాలు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : గంజాయి మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు అంటారు. అయితే ఇలానే గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. తిరుపతిలోని వెంకటపతి నగర్‌లో చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగించే కాకి సుదర్శన్ అనే వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే శనివారం గంజాయి సేవించి ఆ మత్తులో అర్థరాత్రి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ప్రమాదాన్ని స్థానికులు సరైన సమయంలో గుర్తించడంతో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed