- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పంక్చర్ సమస్యను నివారించే కొత్త టెక్నాలజీ టైర్లను విడుదల చేసిన జేకే టైర్స్!

న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత మార్కెట్లోకి మొట్టమొదటిసారిగా పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లను విడుదల చేసింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాహనాలకు పంక్చర్ గార్డ్ టెక్నాలజీ ద్వారా టైర్లు పంక్చర్ అయిన సమయంలో గాలి బయటకు వెళ్లకుండా సెల్ఫ్ హీల్ అవుతాయని కంపెనీ వెల్లడించింది. 6ఎంఎం మందం వరకు మేకులు లేదా ఇతర ఎలాంటి వస్తువులైనా టైర్లకు గుచ్చుకుంటే వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రయాణించవచ్చు. ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా టైర్ లోపలి భాగంలో సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్ ద్వారా ఇది సాధ్యమవుతుందని కంపెనీ వివరించింది.
అత్యాధునిక టెక్నాలజీతో వచ్చిన ఈ టైర్లు అరిగిపోయే వరకు వాహనదారులు పంక్చర్ల విషయంలో ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉండదని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి సింఘానియా మాట్లాడుతూ.. సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి విషయంలో జేకే టైర్స్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంది. 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని తీసుకొచ్చామని, ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో టైర్లు జీవితకాలం పూర్తయ్యే వరకు ఇబ్బందుల్లేని ప్రయాణం చేయవచ్చని చెప్పారు. భవిష్యత్తులో వినియోగదారులకు అవసరమైన కొత్త టెక్నాలజీ ద్వారా మరింత సౌకర్యవంతమైన, భద్రత కలిగిన టెక్నాలజీని అందిస్తామని ఆయన వెల్లడించారు.