కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గ పోరు.. దాడులు చేసుకుంటున్న వర్గాలు

by Dishafeatures2 |
కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గ పోరు.. దాడులు చేసుకుంటున్న వర్గాలు
X

దిశ, రాజంపేట: కాంగ్రెస్ పార్టీలో ఎల్లారెడ్డి నియోజకవర్గం చెందిన మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డిల మధ్య వర్గ పోరు రోజురోజుకూ ముదురుతోంది. మండలంలోని ఎల్లారెడ్డి పల్లి తండాలో శుక్రవారం మదన్ మోహన్ రావు వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సేవలాల్ ఆలయం వద్ద ప్రజలతో మాట్లాడుతున్న మదన్మోహన్రావు వర్గానికి చెందిన కార్యకర్తలపై సుభాష్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. రచ్చబండ కార్యక్రమం గతంలోనే మండల కేంద్రంలో ఉందని మళ్లీ మీరు ఎలా నిర్వహిస్తారని మదన్ మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం పట్ల సుభాష్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడికి ప్రయత్నించారని ప్రజలు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed