తెలంగాణలో పలు కంపెనీలపై ఐటీ శాఖ దాడులు..

by Nagaya |
తెలంగాణలో పలు కంపెనీలపై ఐటీ శాఖ దాడులు..
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ఇన్ఫ్రా కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. ఐటీ శాఖ అధికారులు కేఎన్ఆర్ ఇన్ఫ్రా, గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌వీఆర్, జీవీపీఆర్ కంపెనీలపై దాడులు చేసి ఆదాయ పన్ను వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే, కేఎన్‌ఆర్(KNR) కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రూ.150 కోట్ల లావాదేవీలకు ట్యాక్స్ కట్టలేదని ఐటీ అధికారుల ముందు ఒప్పుకున్నారు. ఈ కంపెనీకి చైర్మన్లుగా నర్సింహా రెడ్డి, జలేందర్ రెడ్డిలు ఉన్నారు. వీరితో పాటు గజ ఇంజనీరింగ్ సంస్థ కంపెనీలో జరిగిన సోదాల్లోనూ రూ.50 కోట్ల విలువైన లావాదేవీల్లో పన్ను కట్టలేదని అధికారుల ముందు ఒప్పుకున్నారు. మరో కంపెనీ ఆర్వీఆర్ సంస్థ రూ.60 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.



Next Story

Most Viewed