- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చైనా రుణాలపై నిషేధం విధించండి : ఐఎంఎఫ్
ఇస్లామాబాద్: చైనా నుంచి ఇకపై ఎలాంటి రుణాలను పాకిస్తాన్ తీసుకోకుండా నిషేధించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భావిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే 350 బిలియన్ రూపాయలను చైనాకు చెందిన వివిధ కంపెనీలకు చెల్లించాల్సిన పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టుల కోసం తాజాగా మరో 7.9 బిలియన్ పాక్ రూపాయలను చైనానుంచి రుణంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే విదేశీ రుణాల సహాయంతో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదని పైగా పాకిస్తాన్ సమూలంగా సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో చైనానుంచి రుణాలు తీసుకోవడం, చైనాకు చెందిన స్వతంత్ర విద్యుత్ ఉత్పాదక సంస్థలకు అధిక వడ్డీలతో చెల్లింపులు చేయడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టుల ఒప్పంద షరతులను సవరించాలని ఐఎంఎఫ్ చేసిన డిమాండ్లను చైనా పెడచెవిన పెట్టింది. పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ (47.5 బిలియన్ డాలర్లు)లో 40 శాతంకంటే ఎక్కువ భాగం రుణ చెల్లింపులకో సరిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణచెల్లింపుల్లో 29.1 శాతం పెరుగుదల నమోదైంది.
2022-23 పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ కీలకమైన వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పి దివాలా అంచుల్లో ఉన్న పాకిస్తాన్ ఐఎమ్ఎఫ్ షరతులకు ఒప్పుకుని రుణాలు తీసుకుంటే సంస్థాగత సంస్కరణలను దూకుడుగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్లో అధికభాగం ఇప్పటికే రుణ చెల్లింపులకే కేటాయిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని పాక్ మీడియానే చెబుతుండటం విశేషం.